ADVERTISEMENT
home / Bigg Boss
Bigg Boss Telugu 3:  బిగ్ బాస్‌ని నిందించారు.. అందుకే పునర్నవి, శ్రీముఖిలకి శిక్ష పడిందా?

Bigg Boss Telugu 3: బిగ్ బాస్‌ని నిందించారు.. అందుకే పునర్నవి, శ్రీముఖిలకి శిక్ష పడిందా?

‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 3’లో  (Bigg Boss Telugu) 50 రోజులు పూర్తవడంతో.. ఇక మిగిలిన 50 రోజులు మరింత కీలకంగా మారాయి. బిగ్ బాస్ కూడా స్వయంగా ఇదే విషయాన్ని చెప్పడం గమనార్హం. ఇప్పటి నుండి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే‌కి సంబంధించిన రేస్ మొదలైంది అని కూడా ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే మొన్న జరిగిన నామినేషన్స్ కూడా రసవత్తరంగానే సాగాయి. 

Bigg Boss Telugu 3: టాస్క్ సందర్భంగా.. ఇంటిసభ్యుల మధ్య గొడవలు ..!

ఇక నిన్నటి వీక్లి టాస్క్ సందర్భంగా జరిగిన కొన్ని సంఘటనలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. అవేంటంటే – వీక్లీ టాస్క్ ‘ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం’ సందర్భంగా.. అయిదుగురు హౌస్ మేట్స్ – బాబా భాస్కర్ , రాహుల్ సిప్లిగంజ్, వితిక, శిల్పా చక్రవర్తి, హిమజలు దెయ్యాలుగా మారారు. మిగిలిన సభ్యులు – వరుణ్ సందేశ్, శ్రీముఖి, పునర్నవి (Punarnavi), మహేష్ విట్టా, శివజ్యోతి, రవికృష్ణలు మనుషులుగా వ్యవహరించారు.

ఇక ఈ టాస్క్‌లో దెయ్యాలు.. మనుషుల్లో ఒక్కొక్కరిని ఎంపిక చేసుకొని.. వారిని విసిగించేందుకు ప్రయత్నించాలి. అలా విసిగించిన తరువాత బిగ్ బాస్ ఒక పాటని ప్లే చేస్తారు. దాని తరువాత ఎంపిక చేసుకున్న వారికి సంబంధించి ఇచ్చిన టాస్క్‌ని పూర్తి చేస్తే.. వారు చనిపోయినట్టు బిగ్ బాస్ ప్రకటిస్తారు.

ADVERTISEMENT

ఈ క్రమంలో వరుణ్ సందేశ్‌ని చంపాలంటే అతనికి మూడు సార్లు ముద్దులు పెట్టి.. అద్దం పై ‘వరుణ్ ఈజ్ ఏ ఘోస్ట్” అని రాయల్సి ఉంటుందని తెలిపారు. ఇక శ్రీముఖికి సంబంధించి ఆమె తలపైన గుడ్డు కొట్టాల్సి ఉంటుంది. అదే మాదిరిగా మహేష్ విట్టా చేత కూడా.. అయిదు సార్లు షర్ట్ విప్పించాల్సి ఉంటుంది. అంతే కాకుండా పునర్నవిని స్విమ్మింగ్ పూల్‌లో తోసేయాల్సి ఉంటుంది. అలాగే రవికృష్ణ చేత డ్యాన్స్ కూడా చేయించాలి. అదేవిధంగా శివజ్యోతిని ఏడిపించాల్సి ఉంటుంది.

Bigg Boss Telugu 3: బాబా భాస్కర్, శ్రీముఖిల మధ్య విభేదాలు మొదలయ్యాయా?

అయితే నిన్న ప్రసారమైన ఎపిసోడ్‌లో వరుణ్ సందేశ్, పునర్నవి, శ్రీముఖిలకి సంబంధించిన టాస్క్‌లను పూర్తి చేయగా.. వారు చనిపోయి దెయ్యాలుగా మారినట్టు బిగ్ బాస్ ప్రకటించారు. వీరి టాస్క్‌లు పూర్తి చేసిన వితిక, హిమజ, శిల్పా చక్రవర్తిలు మనుషులుగా మారిపోయారు. ఇక మిగిలిన వారి టాస్క్‌లు ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో చూస్తాం.

ఇక ఈ టాస్క్ సందర్భంగా తనని స్విమ్మింగ్ పూల్‌లో రెండు సార్లు తోసేశారని.. అలా చేయడం తనకు నచ్చలేదని పునర్నవి తెలిపింది. అసలు ఈ టాస్క్ రూల్స్ తనకు నచ్చలేదని.. ఇటువంటి చెత్త ఆటని తాను ఆడనని చెప్పి, బిగ్ బాస్ (Bigg Boss) పై తన కోపాన్ని ప్రదర్శించింది. తను బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ప్రకారం.. ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోయినప్పటికి.. తనని చనిపోయినట్టు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నిస్తూ ఆమె బిగ్ బాస్‌ని అడిగింది. పునర్నవి వాదనకు శ్రీముఖి (Sreemukhi) కూడా మద్దతు తెలిపింది. ఆ విధంగా.. ఈ ఇద్దరు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పై తమ అసహనాన్ని తెలియచేశారు.

ADVERTISEMENT

అయితే ఈరోజు ప్రసారమయ్యే ఎపిసోడ్‌‌ ప్రోమోలో పునర్నవి, శ్రీముఖి, మహేష్ విట్టాలని బిగ్ బాస్ శిక్షిస్తున్నట్లు కనిపించడం గమనార్హం.  వీరు బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పై తమ వ్యతిరేకతను తెలపడం వల్లే ఇలా జరిగి ఉంటుందని తెలుస్తోంది. మరి వీరి కోపానికి సరైన కారణముందా? లేదా? అనేది తెలియాలంటే.. ఈ రోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

ఇక ఈ ఎపిసోడ్ ప్రారంభంలో నామినేషన్స్ సందర్భంగా శ్రీముఖి‌ని కాదని రవికృష్ణని సేవ్ చేసిన కారణంగా… బాబా భాస్కర్, శ్రీముఖిల మధ్య గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో వీరిరువురు మాట్లాడుకుని.. ఆ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరి మధ్య సమస్య సమసిపోయిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Bigg Boss Telugu 3: డబుల్ ఎలిమినేషన్‌కి ప్లాన్ చేసిన బిగ్‌బాస్?

10 Sep 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT